|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 07:56 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జపాన్లో సందడి చేశారు. ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ నెల 12న ఈ సినిమా జపాన్లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఆ దేశానికి వెళ్లిన ప్రభాస్, అక్కడి అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన వినయంతో, ఆప్యాయతతో అందరి మనసులు గెలుచుకున్నారు.ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడారు. "మీ ప్రేమకు ధన్యవాదాలు. బాహుబలి తర్వాత రాజమౌళి, శోభు, లక్ష్మి అందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరు చాలా మంచి అభిమానులని, ఎమోషనల్ పీపుల్ అని అనేవారు. గడిచిన 10 ఏళ్లుగా జపాన్ గురించి వింటూనే ఉన్నాను. ఎట్టకేలకు మిమ్మల్ని చూశాను. థ్యాంక్యూ" అని అన్నారు."జపాన్కు వచ్చి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలనేది నా కల. అది ఇప్పుడు నెరవేరింది. లక్ష్మి గారిలాగే నేను కూడా ప్రతీ ఏటా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను" అని అభిమానులతో డార్లింగ్ అన్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ చిత్రాలను కలిపి ఒకే భాగంగా ఈ స్పెషల్ ఎడిషన్ను రూపొందించారు. ప్రభాస్ రాకతో భారతీయ సినిమాకు, జపాన్ ప్రేక్షకులకు మధ్య బంధం మరింత బలపడింది.
Latest News