by Suryaa Desk | Fri, Sep 27, 2024, 03:44 PM
గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ట్రాక్టర్ ని ఎల్ఎండీ పోలీసులు స్వాధీనం చేసుకొని, దాని యజమానికి అప్పగించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లికి చెందిన గొస్కుల ఓదెలు కు చెందిన ట్రాక్టర్ గత ఆగస్టు లో కనిపించకుండా పోయింది. దీంతో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ట్రాక్టర్ అపహరణకు గురైందటూ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయింది.
అయితే కనిపించకుండా పోయిన ట్రాక్టర్ తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం గ్రామంలో గురువారం దొరికింది. దీంతో ట్రాక్టర్ యజమాని అక్కడికి వెళ్లి ఆరా తీయగా గ్రామానికి చెందిన పెట్టెం కిరణ్ అనే వ్యక్తి ఇతరుల వద్ద నుంచి తను కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఈ పోలీసులు విచారణ జరిపి సరైన పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్ ను తిరిగి యజమానికి అప్పగించారు.