by Suryaa Desk | Fri, Sep 27, 2024, 04:16 PM
తెలంగాణ పోషణ మాసం సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు నల్గొండ వారు గురువారం రోజు తిప్పర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్త్రీలు, బాల బాలికలు, తీసుకోవలసిన జాగ్రత్తలు పోషక విలువలు పిల్లలకు సమతుల్యత గల ఆహారమును అందించడం ద్వారా బలంగా దృఢంగా ఉంటారని మానసిక వికాసము అభివృద్ధి చెందుతుందని.
ఏ డబ్ల్యు సి సూపర్వైజర్ ఎం జ్యోతి అన్నారు.కిషోర్ బాలికలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. బరువు తక్కువ గల పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెల్త్ సూపర్వైజర్ కే సిలువ వివరించారు. సీజనల్ గా సంక్రమించే వ్యాధులు పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హ్యాండ్ వాష్ తదితర అలవాట్లను ఏఎన్ఎం శైలజ నేర్పించారు , విద్యార్థులకు మంచి పోషకాలు గల ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం అని హ్యాండ్ వాష్ తదితర అంశాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పర్వీన్ సుల్తానా, రజిత, మమత, ఆశ వర్కర్లు దనమ్మ ,సువర్ణ, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు