by Suryaa Desk | Fri, Sep 27, 2024, 04:18 PM
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ షాద్ నగర్ అసెంబ్లీ పరిధిలో శుక్రవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫరూఖ్ నగర్ మండలం రాయికల్, అన్నారం, షాద్ నగర్ టౌన్లో పార్టీ స్థానిక నాయకులతో కలిసి అరుణ బీజేపీ సభ్యత్వాలు చేయించారు.
అనంతరం ఎంపీ అరుణ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సంస్థాగతంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అందె బాబయ్య తదితరులు పాల్గొన్నారు.