by Suryaa Desk | Fri, Sep 27, 2024, 04:27 PM
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూరు గ్రామానికి చెందిన ప్రవీణ్, శ్రీను అనే వ్యక్తులను అక్రమంగా అరెస్టు చేసి చితకబాదిన వ్యక్తి ఇంటికి వెళ్లి పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
ప్రభుత్వాలు శాశ్వతం కాదని ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తే సామాన్య ప్రజలు న్యాయం కోసం ఎవరి వద్దకు వెళ్తారు. అని ప్రశ్నించారు.పోలీసులు వ్యవహార శైలి మార్చుకోకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని మాజీ మంత్రి అన్నారు.