by Suryaa Desk | Fri, Sep 27, 2024, 04:30 PM
వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం నారెగుడా గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేయడానికి వారం క్రితం హైదరాబాద్ ప్రజా భవన్ కు వచ్చిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో నారెగుడా గ్రామానికి వచ్చి ఆ రైతులను పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి.
పోలీసుల అరెస్ట్ చేసిన రైతులను కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడించిన సబితా ఇంద్రారెడ్డి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న మీకు మేము ఎప్పుడూ అండగా ఉంటాం అని కేటీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.