by Suryaa Desk | Fri, Sep 27, 2024, 04:36 PM
అందోలు పెద్ద చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని పబ్లిక్ హెల్త్ ఈ ఈ తిరుపతిరావు సంబంధిత శాఖ అధికారులు,కాంట్రాక్టర్ను ఆదేశించారు. గురువారం పెద్దచెరువు వద్ద స్వయంగా పనులను పరిశీలించారు. ఈ పనులకు ప్రభుత్వం ఎస్డీఎఫ్ నుంచి రూ.2.50 కోట్ల రూపాయలు మంజూరైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కట్ట వెడల్పు పనులను ప్రారంభించారు. సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
మొరం, గ్రీనరీ, లైటింగ్, వాకింగ్ ట్రాకింగ్ పనుల్లో వేగం పెంచాలన్నారు. పనులను నాణ్యతగా చేపట్టాలని ఆయన సూచించారు. చెరువు కట్ట మీదుగా రోడ్డును ఏర్పాటు చేసేందుకు అవసరమైన పనులను చేపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఏఈ సాయి ప్రణీత్, జూనియర్ అసిస్టెంట్ పండరి, వర్క్ ఇన్సె్పక్టర్ మహేందర్లు ఆయన వెంట ఉన్నారు.