by Suryaa Desk | Fri, Sep 27, 2024, 04:41 PM
డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ గ్రామంలో ఎన్ హెచ్ ఏం నిధుల నుంచి మంజూరు అయినా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పల్లె దవాఖానా పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై,పల్లె దవాఖానా పనులను శంకుస్థాపన చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
ఈ సందర్బంగా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ప్రారంభిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వేంకటేశ్వర్లు,మండల పార్టీ అధ్యక్షులు నల్లవెల్లి రాజేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,దేవరకొండ జడ్పీటీసీ అరుణ సురేష్ గౌడ్, యువజన విభాగ నాయకులు కిన్నెర హరికృష్ణ పి ఆర్ ఏ ఇ తదితరులు పాల్గొన్నారు.