by Suryaa Desk | Sun, Sep 29, 2024, 09:16 AM
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందనే భరోసానివ్వాలని రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలను ఎస్సై రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో తప్పనిసరిగా తనిఖీలు చేపట్టాలని సూచించారు.