by Suryaa Desk | Sun, Sep 29, 2024, 07:01 PM
భారీ వర్షాలతో నీట మునిగిన పొలాల్లో వరద నీరు బయటకు పోయిన తర్వాత ఉద్యాన పంటల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేత తోటల్లో మొక్కలు చనిపోయిన చోట తిరిగి నాటుకోవాలి.
కొంచెం నేల వాలిన మొక్కలను లేపి మొదళ్ల వద్దకు మట్టి వేయాలి. మొక్కలు తిరిగి బలంగా పెరగడానికి అవసరమైన పోషకాల మోతాదును పెంచాలి. వ్యాధికారక శిలీంద్రాలను, చీడలను నివారించడానికి తగిన చర్యలను చేపట్టాలి. దీని కోసం స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి.