by Suryaa Desk | Sun, Sep 29, 2024, 08:03 PM
కల్లు గీత కార్పొరేషన్ కు ఛైర్మన్ ను నియమించాలని గౌడ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మహేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు.
గౌడ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కల్లు గీత కార్మికులకు అందరికీ కవచాలు ఇవ్వాలని కోరారు. తాటి, ఈత వనాలు పెంచేందుకు భూములు కేటాయించాలని అన్నారు.