తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా ఆదివారం కొడంగల్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇవాళ, రేపు 2 రోజుల పాటు ఆయన కొడంగల్ లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొడంగల్ రానున్నారు. ఈ క్రమంలోనే సతీసమేతంగా సీఎం దంపతులు కొడంగల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa