హుస్నాబాద్ ప్రాంతం లో ధాన్యం పత్తి మొక్క జొన్న పంటలను ప్రభుత్వ కొనుగోలు ప్రారంబించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికీ తీసుక వెళ్లి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ.హుస్నాబాద్ ఆర్ డి ఓ రామ్మూర్తి కీ బి ఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రన్ని ఇచ్చారు. హుస్నాబాద్ ప్రాంతం లో ధాన్యం పత్తి,మొక్క జొన్న పంట ల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభంచకపోవడం వలన రైతుల అవసరాలను ఆసరాగా తీసుకొని మిల్లర్లు మరియు దాళారులు రైతులను నట్టేట్ట ముంచుతున్నారు. వరి కోతలు ప్రారంభం అయి దాదాపు 20 గడిచిన ఇంత వరకు సరియన కొనుగోలు కేంద్రాలు ప్రారంభాలు కాలేదు.
ప్రారంబించిన కొనుగోలు కేంద్రాలలో ఒక్క బస్తా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు మార్కెట్ యార్డ్ లో రైతులు అమ్ముకోవడానికి తెచ్చిన ధాన్యం తో పడిగాపులు కాస్తున్నారు పత్తి మరియు మొక్క జొన్న పంటలను కొనుగోలు చేయడానికి సి. సి ఐ మార్క్ పేడ్ కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ప్రారంబిoచ లేదు. రైతులు అనేక పెట్టుబడులు పెట్టి కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లు పొందలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో మాత్రం లో శూన్యం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మాటలు వేరు చేతలు వేరేలా ఉన్నాయి, అని బి ఆర్ యస్ పార్టీ ఆరోపిస్తుంది పంటలు అన్ని రైతులు అమ్ముకున్నoక కొనుగోలు కేంద్రాలు ప్రారంబిస్తారా అని ప్రశ్నినిస్తూన్నాం కనీసం ఇప్పటికైన రైతులకు సరి ఆయినా గిట్టుబాటు ధర వచ్చేవిధంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంబించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వన్ని బి ఆర్ యస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే రానున్న రోజుల్లో రైతుల పక్షాన బి ఆర్ యస్ పార్టీ పోరాటం చేస్తుంది అని ప్రభుత్వన్ని హెచ్చరిస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఆయిలేని మల్లికార్జున రెడ్డి తదితరు లు పాలొగొన్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa