ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుపేద మృతురాలి కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 03:12 PM

మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామ పంచాయతి పరిదిలోని, చంద్రుగూడెం నివాసి అయిన, నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ రహీం, నానమ్మ లతీభ బి, అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించగా, విషయం తెలుసుకున్న గూడూరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, హుటా హుటిన వారి స్వగృహానికి చేరుకొని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తదానంతరం ఆ నిరుపేద  కుటుంబానికి  క్వింట బియ్యం తక్షణ సహాయంగా అందజేశారు. ప్రధాన అనంతరం  మహమ్మద్ లతీబా బీ, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారి కుటుంబానికి అండదండలుగా ఉంటానని భరోసా ఇస్తూ.. తన  ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గూడూరు మాజీ ఎంపీపీ, సర్పంచ్ నూనావత్ రమేష్ నాయక్. వారితో పాటు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి. యాకూబ్ పాషా, మండల సీనియర్ నాయకులు కన్నబోయిన వెంకన్న, కోరే కుమార స్వామి, టౌన్ ప్రధాన కార్యదర్శి దోమ ఉపేందర్, పత్తి వెంకన్న, గోనే శోభన్ బాబు, దోమ సతీష్, మహమ్మద్ సలీం, నబి సాబ్, కుండె కిషన్, మాజీ వార్డు సభ్యుడు హెచ్. శివ, గోపగాని యాదగిరిగౌడ్, మండల మల్లేష్, గళ్ళ చంటి, బండారి యుగంధర్, గొడుగు మునేష్, వాంకుడోత్ చందు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa