ఫోటోలకు ఫోజులిస్తున్నారంటూ ఒక మహిళా ప్రజా ప్రతినిధిని ఆ గౌరవపరిచేలా మాట్లాడడం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నీకు సమంజసం కాదని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతిపై చేసిన ఆరోపణలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల లో ఉండి ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. మహిళా ప్రజా ప్రతినిధిని ఫోటోలకు ఫోజులిస్తుందంటూ... మీరు వాడిన భాష నియోజకవర్గం ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. కోదాడ దిన దినాభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక ఇటువంటి ఆరోపణలను మీరు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మీ హయాంలో కోదాడ క్యాంప్ ఆఫీస్ ను ఏ విధంగా బ్రష్టు పట్టించారు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అన్నారు.
మీ ప్రభుత్వ హయాంలో కోదాడలో గంజాయి విచ్చలవిడితనంగా తిరిగి అనేక మంది యువత చెడు దారిన పట్టారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపిందన్నారు. మీ హయాంలో చేసిన గంజాయి అక్రమ రవాణా ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మీ ప్రభుత్వం చేసిన ఫోన్ టాపింగ్ అక్రమాలు అవినీతిని ప్రజలు వద్దనుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని, అవినీతి లేని కోదాడను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని అన్నారు. మంది కన్న పిల్లలను మా పిల్లలను కోవటం ఎవరికి వర్తిస్తుందో కోదాడ ప్రజలకు తెలుసు అని ఆయన వ్యంగంగా అన్నారు. అభివృద్ధితో పోటీ పడలేక మీరు అక్కస్సి వెళ్లగకుతున్నారని ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని త్వరలోనే మీకు స్థానిక సంస్థలలో తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే తప్పులను చూపిస్తే నిజాయితీగా స్వీకరిస్తామని అన్నారు.నీ హయాంలో జరిగిన గంజాయి అక్రమ రవాణాపై న్యాయ విచారణ కోరే దమ్ముందా అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa