మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద చోటు చేసుకుంది. కారు, ఆటో ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నర్సాపూర్ పట్టణ సమీపంలోని మెడలమ్మ గుడి సమీపంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa