జోగిపేట పట్టణంలో కారు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన బుధవారం స్థానిక హనుమాన్ చౌరస్తాలో జరిగింది. డ్రైవర్ అబ్దుల్ ఈస ఉదయమే మద్యం సేవించి కారును నడపడంతోనే ఈ సంఘటన జరిగినట్లుగా ఏఎస్ఐ గౌస్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బొడ్మట్పల్లి మొగులయ్యకు చెందిన కారులో తన డ్రైవర్తో కలిసి మెయిన్రోడ్డుపైకి వెళుతూ కారును అదుపుచేయకపోవడంతో చౌరస్తాలో అందోలు వైపు వెళుతున్న ద్విచక్రవానాలను ఢీకొంటూ ఎదురుగా దుకాణాల వైపు దూసుకువెళ్లింది. మద్యలోనే టీడీపీ జెండా గద్దెను ఢీకొడుతూ పల్టీ కొట్టింది. గద్దె లేనట్లయితే 5 మీటర్ల దూరంలోని దుకాణాల్లోకి దూసుకువెళ్లి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.
రోడ్డు ప్రక్కనే ఉన్న మురళీకి చెందిన పండ్ల దుకాణం యజమాని కారు దూసుకురావడాన్ని చూపి పక్కకు పారిపోయారు. పల్టీకొట్టిన కారును స్థానికులు లేపి నిలబెట్టడంతో కారులో ఉన్న మొగులయ్య, డ్రైవర్ క్షేమంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో కన్సాన్పల్లి గ్రామానికి చెందిన బేగరి బాలయ్య, సంజీవయ్య, అక్సాన్పల్లికి చెందిన రాజుకు తీవ్రగాయాలయ్యాయి. వారిని అక్కడే ఉన్న మాజీ కోఆప్షన్ సభ్యుడు గోహేర్అలీ, స్థానిక జర్నలిస్టులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్సల అనంతరం గాయపడ్డ వారిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ గౌస్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కారును సంఘటన స్థలం నుంచి తొలగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa