ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రోన్ సర్వే ని పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 05:54 PM

మెట్ పల్లి పట్టణంలో చేపడుతున్న డ్రోన్ సర్వేను గురువారం అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమృత్ 2.0 కింద మెట్ పల్లి పట్టణంలో నూతనంగా మాస్టర్ ప్లాన్ కొరకు సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్ మెంట్  50 సర్వే పాయింట్లను గుర్తించింది. ఈ పాయింట్లను ఆధారం చేసుకుని సంస్థ ప్రతినిధులు డ్రోన్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేను అదనపు కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
డ్రోన్ సర్వేకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి అయిన గౌతమ్ రెడ్డి  మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని సూచించారు. పెండింగులో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మోహన్, మేనేజర్ వెంకటలక్ష్మి, టిపిఓ రాజేంద్రప్రసాద్, ఏఈ తిరుపతి, ఆర్ఓ మీర్జా అజ్మతుల్లా బేగ్, ఇంచార్జీ సానిటరీ ఇన్స్ పెక్టర్ రత్నాకర్, టిఎంసి శివ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa