ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర తెలంగాణలో స్వల్ప భూకంపం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 12:10 PM

తెలంగాణలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.8గా నమోదైంది. 2-5 సెకన్ల పాటు కంపనలు కొనసాగాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జగిత్యాలలో ఓ రైతు ఇల్లు కూలింది. నిపుణులు మరో భూకంప సూచన జారీ చేశారు.కరీంనగర్‌లోని కొత్తపల్లి, చొప్పదండి, తిమ్మాపూర్‌, మానకొండూర్‌, గన్నేరువరం, గంగాధర, రామడుగు మండలాల్లో.. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి, మల్లాపూర్‌, ఎండపల్లి, వెల్గటూర్‌ మండలాల్లో.. రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, సుల్తానాబాద్‌, ధర్మారం, పాలకుర్తి, కమాన్‌పూర్‌ మండలాలు, ఆసిఫాబాద్‌లోని రెబ్బెన మండలం, మంచిర్యాల జిల్లా జన్నారం మండలా ల్లో భూప్రకంపనలు వచ్చాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa