ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసాయిపేటలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 12:32 PM

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. శిబిరంలో పశువులకు నట్ట, పేను నివారణ మందులతో పాటు ఇతర పోషక మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
అలాగే రైతులకు పాడిపశుnవుల సంరక్షణ, పోషణ విషయాలలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇలాంటి శిబిరాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని, పశువుల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa