తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ)లో సమ్మె మోత మోగుతోంది. కార్మిక సంఘాలు తాము ప్రకటించిన సమ్మె నిర్ణయాన్ని అమలులోకి తీసుకురావాలని తేల్చి చెప్పాయి. జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నేతలు, ఈ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని స్పష్టం చేశారు.
సమ్మె మొదలైతే దాదాపు 6,000 బస్సులు రోడ్డుపై నుంచి గల్లంతవుతాయి. దీని ప్రభావం లక్షలాది ప్రజలపై పడే అవకాశం ఉంది. రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు గందరగోళానికి లోనయ్యే పరిస్థితి నెలకొననుంది.
ఈ పరిణామాలపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం, సమ్మె చేపడితే ఎస్మా (ESMA - Essential Services Maintenance Act) ను ప్రయోగించేందుకు వెనుకాడబోమని హెచ్చరించింది. ప్రజల అవసరాల దృష్ట్యా ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వంతో కార్మిక సంఘాల మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో, ఈ సమ్మె ఏ మేరకు తీవ్రతను దాల్చుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa