ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ రక్షణలో సైనికుల వెలకట్టలేని పాత్ర.. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 01:20 PM

ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా భారత సాయుధ దళాలు చేపడుతున్న దాడులు చూస్తుంటే గర్వంగా ఉందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. ఉగ్రదాడుల కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో దేశం మొత్తం కన్నీటిలో మునిగిందని ఆయన గుర్తు చేశారు. 
నాటి నుంచి నేటి వరకు దేశ రక్షణలో సైనికుల పాత్ర అమూల్యమని, వారి పోరాట పటిమ దేశ ప్రజలకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. సాయుధ దళాల ధైర్యసాహసాలు దేశ భద్రతకు బలమైన ఆధారమని అంజయ్య యాదవ్ కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa