రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్ పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అమలు చేస్తున్న సిబిల్ స్కోరు నిబంధనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. జాతీయ మాలల ఐక్య వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాల గురువారం మాట్లాడుతూ, ఈ నిబంధన సామాజిక న్యాయానికి విరుద్ధమని తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన మాల మరియు ఇతర దళిత యువతకు ఉపాధి, ఆర్థిక అభివృద్ధి కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకంలో సిబిల్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను వడపోత చేయడం అన్యాయమని ఆయన విమర్శించారు. చాలా మంది యువతకు బ్యాంకింగ్ చరిత్ర లేకపోవడం లేదా చిన్నచిన్న లోన్ సమస్యల కారణంగా సిబిల్ స్కోరు తక్కువగా ఉండవచ్చు కానీ అది వారి అర్హతను నిర్ణయించే ప్రమాణం కాకూడదన్నారు.
సిబిల్ స్కోరు నిబంధనను వెంటనే తొలగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విధంగా కొనసాగితే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa