ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ నగరంలో ముంపు బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారాలు అందించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని రంగనాథ్ స్పష్టం చేశారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 08:32 PM

హైదరాబాద్ నగరంలో ముంపు బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారాలు అందించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైడ్రా కార్యక్రమంలో భాగంగా, సికింద్రాబాద్‌లోని బుద్ధ భవన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైడ్రాకు కేటాయించిన నూతన వాహనాలు, యంత్రాలను కూడా సీఎం ఆవిష్కరించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ప్రజలు ఏ ప్రభుత్వ విభాగాన్ని సంప్రదించాలో తెలియని క్లిష్టమైన సమస్యలను సైతం హైడ్రా స్వీకరించి, పరిష్కరిస్తోందని తెలిపారు."ఏదైనా సమస్య మా పరిధిలోకి రాదని చెప్పి మేం ఎప్పుడూ గిరిగీసుకోలేదు. ఏ శాఖకు సంబంధించిన బాధ్యత అయినా, తక్షణమే స్పందించి ఆ పనిని మేం పూర్తి చేస్తున్నాం" అని వివరించారు. హైడ్రా చొరవ కారణంగా నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని రంగనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైడ్రా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను ఆయన వివరంగా తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa