ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 02:38 PM

భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మరింత విజయవంతం కావాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది.
పూజ కార్యక్రమానికి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజమౌళి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక సభ్యులు మంచాల రాంగోపాల్, గౌరిశెట్టి రాజు తదితరులు హాజరై పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “దేశ రక్షణ కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భగవంతుడిని ప్రార్థించాం. సైనికులు సురక్షితంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం,” అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa