ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు”పై కమలానగర్‌లో సేమినార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 27, 2026, 02:33 PM

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం కమలానగర్ సీఐటీయూ కార్యాలయంలో “భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు” అనే అంశంపై సెమినార్ జరిగింది. జన విజ్ఞాన వేదిక నాయకులు ప్రభాకర్ ఆహ్వానించగా, ప్రముఖ రచయిత పి. జ్యోతి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్త మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న లౌకిక, ప్రజాస్వామ్య, సోషలిజం సూత్రాలపై భారత రాజ్యాంగం నేడు సవాళ్లను ఎదుర్కొంటుందని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. చివరగా రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa