గాజువాక పోలీసులు నగరవ్యాప్తంగా ఖాతాదారులను మోసం చేస్తున్న నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరారోపణలు ఉన్న ప్రధాన నిందితుడు వీరయ్య చౌదరిని క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వివిధ ఏటీఎంల వద్ద అమాయక ప్రజలను మోసగించి, వారి కార్డులు మార్పిడి చేసి డబ్బు గుంజుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అతని వద్ద నుంచి నకిలీ ఏటీఎం కార్డులు, రూ.1.45 లక్షల నగదు స్వాధీనం చేసుకన్నారు.
![]() |
![]() |