మందస మండలంలోని అంబుగాం పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ తిరుమల చైతన్య బుధవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు.
విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. మందస మండలంలో ఆరు కేంద్రాలలో కట్టుదిట్టమైన భద్రత నడుమ పరీక్షలు జరుగుతున్నాయన్నారు.
![]() |
![]() |