ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీని గుండెల్లో పెట్టుకొని నడిపించిన ప్రతి కార్యకర్తకు అభినందనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 29, 2025, 12:46 PM

టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ అని, ‘అన్న’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో... సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమేనని సీఎం చంద్రబాబు అన్నారు. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com