ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొట్టు పెట్టుకోవద్దు, కంకణం కట్టుకోవద్దు..: ఆదేశాలిచ్చిన డీఎంకే నేత

national |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 08:30 PM

తమిళనాడు డీఎంకే పార్టీకి చెందిన నాయకుడు ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పార్టీ ధోతి కట్టుకున్న తర్వాత కార్యకర్తలు ఎవరూ కుంకుమ పెట్టుకోకూడదని, చేతికి కనీసం కంకణం కూడా ధరించకూడదని చెప్పుకొచ్చారు. అయితే ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా విభూతి పెడితే మాత్రం ఉంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తూ.. రాజాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


తమళినాడులోని నీలగిరి జిల్లాలో రెండ్రోజుల క్రితమే డీఎంకే పార్టీకి చెందిన ఓ కార్యక్రమం జరిగింది. అయితే అక్కడకు ముఖ్య అతిథిగా వెళ్లిన నాయకుడు ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు దేవుడిపై నమ్మకం ఉందని.. తానేమీ హిందు వ్యతిరేకిని కాదని చెప్పారు. ఆపై పేద ప్రజల చిరు నవ్వులోనే దేవుడు ఉంటాడని తమ పార్టీ వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ బొట్టు పెట్టుకున్నా, కుంకుమ ధరించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లా కనిపిస్తామని వివరించారు. వారికి మనకీ ఉన్న తేడా ప్రజలకు అర్థం కావాలంటే.. పార్టీ ధోతీ ధరించిన తర్వాత కుంకుమ పెట్టుకోకూడదని, అలాగే కంకణం కూడా ధరించకూడదని చెప్పుకొచ్చారు.


మీరంతా ఇళ్లలో పూజలు చేసుకున్నా తనకేమీ అభ్యంతరం లేదని.. ఆ సమయాల్లో బొట్టు ధరించినా ఓకే అని అన్నారు. కంకణాలు కూడా కట్టుకోవచ్చని సూచించారు. అయితే ఇళ్లలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విభూతి పెడితే తుడుచుకోవాల్సిన అవసరం లేదని.. దాన్ని పెట్టుకోవచ్చని చెప్పారు. నుదిటిపై విభూతి పెట్టే సంప్రదాయాన్ని తమిళులు దీవెనగా భావిస్తుంటారన్నారు. ఇక్కడితో ఆగకుండా ఎలాంటి ఐడియాలజీ లేని పార్టీ నాశనం అవుతుందని.. అందుకు ఉదాహరణ అన్నాడీఎంకేని అని ఎ రాజా చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.


ముఖ్యంగా తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు దీనిపై స్పందించారు. రాజా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూనే.. పార్టీ నేత ఎంకే స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. గంతోలనూ ఏ రాజా ఇలాంటి వివాదాస్పదన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో పోల్చి అనేక గొడవల్లో ఇరుక్కున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన బీజేపీ.. ఏ రాజాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా ఆయన హిందూ మతంపై కామెంట్లు చేయడం ఆపాలని నేతలు సూచించారు. కుంకుమ ధరించకూడదని చెప్పే హక్కు ఎవరికీ లేదని.. మతసామరస్యం గురించి మాట్లాడనే డీఎంకే పార్టీ హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తుందని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com