విజయనగరంకు చెందిన వారణాసి సావిత్రి అనే మహిళ శనివారం ఆటోలో ప్రయాణిస్తూ బ్యాగు మర్చిపోయి కన్యకా పరమేశ్వరి గుడి వద్ద దిగిపోయింది. దీంతో గమనించిన ఆటో డ్రైవర్ దిలీప్ కుమార్ ఆ బ్యాగును డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఏ ఎస్ ఐ యు రమేష్ కు అప్పగించాడు.
దీంతో ఏ ఎస్ ఐ బాధితరాలకు బ్యాగును అప్పగించారు. బ్యాగులో చెవి దిద్దులు, కొంత నగదు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ కు అభినందనలు తెలిపారు.
![]() |
![]() |