ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలోని వినాయకనగర్‌లో స్థలం విషయంలో దాడికి పాల్పడినట్లు అహ్మద్ బాషాపై కేసు నమోదైంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 06, 2025, 03:53 PM

అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. ఆయన కువైట్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడపలో నమోదైన కేసులకు సంబంధించి లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అహ్మద్ బాషాను కడప పోలీసులకు అప్పగించారు. కడపలోని వినాయకనగర్‌లో స్థలం విషయంలో దాడికి పాల్పడినట్లు అహ్మద్ బాషాపై కేసు నమోదైంది. అంతేకాకుండా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని దూషించినందుకు కూడా అతడిపై కేసులు ఉన్నాయి.ఈ నేపథ్యంలో, దేశం విడిచి వెళుతుండగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్ బాషాను కడపకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com