తాను బతికున్నంత కాలం ఎవరి ఉద్యోగం పోనివ్వనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం 25 వేల మంది టీచర్లను నియమించుకోగా దానిని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది.
నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉండడంతో నియామకాలను నిలిపివేసింది. ఈ క్రమంలో సదరు టీచర్లతో మమతా బెనర్జీ సమావేశమై వారికి ధైర్యం చెప్పారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారు.
![]() |
![]() |