అగ్నివీరులకు హర్యానా ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. సీఎం నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని సీఎం నాయబ్ సింగ్ సైనీ అన్నారు.
![]() |
![]() |