కోనసీమ జిల్లా అయినవిల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నేత తొలేటి ఉమపై నిన్న అయినవిల్లి మండల అధ్యక్షుడు పొలిశెట్టి రాజేశ్ దాడి చేశారు. అర్ధరాత్రి తొలేటి ఉమ ఇంట్లోకి రాజేశ్, అతని అనుచరులు చొరబడి దాడి చేశారు.
ఈ దాడిలో ఉమ, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి జనసేన మండల అధ్యక్షుడు పొలిశెట్టి రాజేశ్ను అదుపులోకి తీసుకున్నారు.
![]() |
![]() |