ముంబై నుండి వారణాసికి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సుశీలాదేవి(89) అనే మహిళ గాల్లో అనారోగ్యానికి గురికావడంతో, విమానాన్ని ఛత్రపతి సంభాజీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్ అనంతరం వైద్య బృందం ఆమెను పరీక్షించి మరణించినట్లు ప్రకటించింది. పోలీసులు ఫార్మాలిటీలు పూర్తి చేశారు. ఆ తర్వాత విమానం వారణాసికి పయనమైంది.సుశీలా దేవిని వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. విమానయాన సంస్థ ప్రకారం, మహిళ మృతదేహాన్ని ఛత్రపతి సంభజినగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపారు.
![]() |
![]() |