గన్నవరం టీడీపీ కార్యాలయం దాది పై రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీకి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. వంశీ రిమాండ్ ను ఈ నెల 22వ తేదీ వరకు కోర్టు పొడిగించింది.వంశీ రిమాండ్ ముగియడంతో ఆయనను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు రిమాండ్ పొడిగించడంతో ఆయనను మళ్లీ జైలుకు తరలించారు.ఈ కేసులో మిగిలిన నిందితులు నేపాల్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.అక్కడి నుంచి వీరు రాత్రి సమయాల్లో సన్నిహితులకు ఫోన్లు చేస్తూ కేసు విషయాలను, పోలీసుల కదలికలను తెలుసుకుంటున్నారు. ఈ నలుగురూ నేపాల్ లో ఎక్కడ తలదాచుకున్నారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు.
![]() |
![]() |