ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొగుడుతారనుకుంటే కారు ఆపి మరీ క్లాస్ పీకిన ఢిల్లీ సీఎం

national |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 07:56 PM

దేశ రాజధీని ఢిల్లీలో శనివారం రోజు కారు నడుపుతూ వెళ్తున్న ఓ వ్యక్తి.. అక్కడే ఉన్న ఆవులకు రొట్టెలు పెట్టారు. అయితే రోజూ అదే దారిలో వెళ్తుండగా వాటిని గమనించి ఇంటి నుంచి వాటిని తీసుకొచ్చారు. మంచి ఉద్దేశంతోనే ఆయన ఇదంతా చేస్తుండగా.. అదే సమయంలో ఆ దారిపై వెళ్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆ విషయాన్ని గుర్తించారు. వెంటనే తాను వెళ్తున్న కాన్వాయ్‌ను ఆపి మరీ సదరు వ్యక్తి దగ్గరకు వచ్చారు. రెండు చేతులా నమస్కారం చేస్తూనే ఆయనతో ముచ్చటించారు. అయితే అంతా అనుకున్నట్లుగా ఆమె.. ఆయన్ను పొగడలేదు. మరోసారి పొరపాటును కూడా ఇలా చేయకండి చెప్పారు.


ముఖ్యంగా రొట్టెలను విసరడం బాగాలేదని.. రొట్టెలను ఆహారంగా మాత్రమే చూడాలని వివరించారు. అదే మన సంస్కృతి, విస్వాసం, గౌరవాలకు గుర్తింపు అని పేర్కొన్నారు. అంతేకాకుండా మీకు నిజంగానే ఇలా వాటి కడుపు నింపాలని అనిపిస్తే గోశాలకు వెళ్లాలని.. కానీ రోడ్డుపై ఉన్న ఆవులకు ఇలా ఆహారం వేయడం వల్ల అవి ఇక్కడే ఉంటున్నాయని చెప్పారు. దాని వల్ల రోడ్డుపై ప్రయాణాలు చేస్తున్న వారందరూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇదంతా వివరించగా రొట్టెలు వేసిన వ్యక్తి కూడా క్షమాపణలు చెప్పి మరీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


అయితే ఢిల్లీ సీఎం అతడితో మాట్లాడుతున్నప్పుడు పలువురు దీన్ని వీడియోగా తీశారు. దీన్ని కాస్తా ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రజలంతా ఆహారాన్ని గౌరవించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌరవ పచకూడదని చెప్పుకొచ్చారు. అలాగే జంతువుల కడుపు నింపాలంటే గోశాలలకు వెళ్లాలని సూచించారు. బీజేపీ సర్కారు గోశాలల కోసం భారీగానే డబ్బులు ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధానిలో మోడల్ గోశాలలు ఏర్పాటు చేసేందుకు రూ.40 కోట్లు కేటాయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com