AP: రాష్ట్రంలో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. మత్స్య సంపదను కాపాడటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా రెండు నెలల పాటు చేపల వేటపై నిషేధం విధిస్తుంది. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెడతాయి. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లరాదు. అయితే స్థానికంగా కర్ర తెప్పలకు మాత్రం అనుమతి ఉంది.
![]() |
![]() |