మాజీ CM జగన్ పాపిరెడ్డిపల్లి సమీపంలో ప్రయాణించిన హెలికాప్టర్ విండో షీల్డ్కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పైలెట్, కోపైలెట్కు పోలీసులు రెండు రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఏప్రిల్ 16న విచారణకు హాజరు కావాలని కూడా చెప్పారట. అయితే, రామగిరిలోని పాపిరెడ్డిపల్లిలో టీడీపీ నేతల దాడుల్లో మరణించిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి బెంగళూరు నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ లో వైఎస్ జగన్ రామగిరి వెళ్లారు. ఇక, లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో జగన్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో రోడ్డు మార్గంలో కారులో తిరిగి వెళ్లి పోయారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.
![]() |
![]() |