ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్ కార్యాలయంలోనూ పంధ్రాగస్టు వేడుకలు జరుపుకోడానికి ఏర్పాటు చేశారు. అయితే, హఠాత్తుగా ఆ కార్యక్రమంలో ప్రత్యక్షమైన ఖలిస్థానీ సానుభూతిపరులు గలాటా సృష్టించారు. మెల్బోర్న్ భారత కాన్సులేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు అక్కడ ఉన్న భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారంతా దేశభక్తి గీతాలు ఆలపిస్తూ... సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఖలీస్థానీలు వేడుకల్లోకి చొరబడి.. తమ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అయితే, వెంటనే ఆస్ట్రేలియా పోలీసులు జోక్యం చేసుకోవడం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వర్గం ఖలీస్థాన్ అనుకూల నినాదాలు చేస్తుండగా... మరో వర్గం దేశభక్తి గీతాలతో వారికి కౌంటర్ ఇస్తోంది. పోలీసులు అక్కడకు చేరుకుని.. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.
కాగా, ఇటీవలే మెల్బోర్న్లోని స్వామినారాయణ్ హిందూ ఆలయంపై దుండుగులు దాడిచేసిన విషయం తెలిసిందే. విద్వేషపూరిత వ్యాఖ్యలు రాసి.. ఆలయం గోడలపై హిట్లర్ ఫోటోను ఉంచారు. దానిపై ‘గో హోమ్ బ్రౌన్..’ అని అంటూ జాత్యంహకారం రాతలు రాశారు. దీంతో పాటుగా దాని సమీపంలోని ఆసియా రెస్టారెంట్లపై కూడా ఇటువంటి రాతలే దర్శనమిచ్చాయి. దీనికి ముందు కూడా 23 ఏల్ల ఓ భారతీయ విద్యార్థిపై జాత్యహంకార దాడి చోటుచేసుకుంది. కెనడా, యూకేల్లోనూ ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తరుచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తోన్న భారతీయులు.. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి వేర్పాటువాద, తీవ్రవాద భావజాలం మనకు, మన సంబంధాలకు మంచిది కాదు..’’ అని ఖండిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa