పాలలో కాల్షియం, పాస్ఫరస్లు ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మంచివి. పాలని తాగడం వల్ల ఎముకలు బలంగా మారడమే కాకుండా బోలు ఎముకల సమస్యల వంటి తగ్గుతాయి. అంతేకాకుండా, ఇందులోని ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా మన బాడీకి ప్రోటీన్ అంది కండరాలు పెరుగుతాయి. సాధారణంగా పాలలోని పోషకాలు ఇమ్యూనిటీని పెంచి వ్యాధులని దూరం చేస్తాయి. రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. పాలు తాగడం వల్ల ఇన్స్టంట్గా ఎనర్జీ అందడమే కాకుండా గుండె ఆరోగ్యం మెరగవుతుంది. రోజంతా ఎనర్జీగా ఉంటారు. అయితే, ఇన్ని లాభాలు మనం పాలని సరిగ్గా తీసుకున్నప్పుడు మాత్రమే లభిస్తాయి. లేదంటే బెనిఫిట్స్ సంగతి పక్కనపెడితే సమస్యలొస్తాయి. ముఖ్యంగా పాలు తాగాక కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. అవేంటంటే
స్నాక్స్తో కలిపి
చాలా మంది పాలు తాగేటప్పుడు, తాగిన తర్వాత చిప్స్, సాల్టీ బిస్కెట్స్, జంక్ ఫుడ్ వంటివి తింటారు. ఇలా మీరు చేస్తుంటే వెంటనే మానుకోవాలి. పాలతో కలిపి లేదా పాలు తాగాక వెంటనే ఉప్పు, కారంతో ఉండే ఫుడ్స్ అసలే తీసుకోవద్దు. వీటి వల్ల కడుపు సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయి. ఎక్కువ ఇలా తీసుకోవడం తీవ్రమైన కడుపు, పేగు సమస్యలు వస్తాయి. అందువల్ల, పిల్లలతో పాటు పాలు తాగిన వెంటనే అలాంటి స్నాక్స్ అసలే తీసుకోవద్దు.
బెల్లం కలిపిన పాలు
అదేంటి బెల్లం కలిపిన పాలు ఆరోగ్యానికి మంచివి దా అనుకుంటారు. నిజానికీ బెల్లం కలిపిన పాలు మంచివే. కానీ, ఆ బెల్లం సరైనది, తాజాది అయి ఉండాలి. అదే విధంగా, కొన్ని రకాల బెల్లంలో ఉప్పు కలుస్తుంది. ఇలా తయారైన బెల్లం కలిపిన పాలు తీసుకోవద్దు. ఇలా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. బెల్లం స్వభావం వేడిగా ఉంటే పాలు చల్లని గుణం కలిగి ఉంటుంది. కాబట్టి, ఇలా రెండింటిని కలిపి తీసుకోవద్దు.
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ పాలతో కలిపి తీసుకోవద్దు. ఈ పండ్లలో ఎక్కువ మొత్తంలో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల పాలలోని ప్రోటీన్ గడ్డకట్టడం ద్వారా జీర్ణ సమస్యలకి కారణమవుతుంది. గ్యాస్, ఉబ్బరం, కడుపులో తిమ్మిరి వంటి సమస్యలకి కారణమవుతుంది. అందుకే, పిల్లలు, పెద్దవారు పాలు తాగిన వెంటనే సిట్రస్ పండ్లు తీసుకోవద్దు. పాలు తాగిన 2 నుంచి 3 గంటల తర్వాత మాత్రమే ఏ పండ్లనైనా తీసుకోవాలి.
చేపలు
పాలలో ఎన్ని గుణాలు ఉన్నాయో చేపల్లో అలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవద్దు. దీని వల్ల సమస్యలు ఎక్కువగా ఫుడ్ పాయిజన్, కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలకి కారణమవుతాయి.
పుచ్చకాయ
పాలు తాగిన వెంటనే పుచ్చకాయ తినడం కూడా అస్సలు మంచిది కాదు. పాలలోని ప్రోటీన్.. పుచ్చకాయలోని యాసిడ్తో కలిసినప్పుడు గడ్డకడుతుంది. దీని వల్ల కడుపునొప్పి, అజీర్ణం, అనారోగ్య ప్రమాదాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా పాలతో కలిపి పాలు తీసుకున్న వెంటనే తీసుకోకూడని ఫుడ్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa