కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కొద్దిపాటి ఉద్రిక్తతకు దారితీసింది. అయితే యువకుల మధ్య జరిగిన ఈ ఘర్షణను కూటమి పార్టీల వివాదం గా ఆపాదిస్తూ కొందరు ప్రచారానికి తెరదీశారు. కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన నాయకులు పార్టీ విషయాలపై చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంలో పట్టణానికి చెందిన ఎం.శివకుమా ర్, బి.అనిల్ మద్యం సేవించి వచ్చారు. నాయకులు మాట్లాడుకుంటుండగా అక్కడకు వచ్చిన శివకుమార్ టీడీపీ, జనసేన గొడవలు మనకెందుకు అంటూ జోక్యం చేసుకోవడంతో అక్కడే కూర్చున్న జనసేన నాయకుడు, ఏఎంసీ డైరెక్టర్ గంగుమళ్ల స్వామి ఒక్కసారిగా పైకిలేచి శివకుమార్పై జనసేనని తిడతావా అంటూ చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడున్న టీడీపీ కార్య కర్త, అతని అనుచరులు మా అన్నయ్యపై చేయి చేసుకుంటావా అంటూ ఒకరికొకరు కలబడ్డారు. అక్కడే ఉన్న టీడీపీ, జనసేన నాయకులు ఇరు వర్గాలను వారించారు. సమాచారం తెలుసుకు న్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను పంపించివేశారు. పార్టీ కార్యాల యం నుంచి స్వామిని ఇంటి వద్ద కారు దింపుతామంటే వినకుండా నడిచి దొమ్మేరు బయలుదేరాడు. కొవ్వూరు బస్టాండ్ సెంటర్లో యువకులు మళ్లీ స్వామిని అడ్డగించడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. స్వామిని పోలీసు వాహనంలో దొమ్మేరు తరలించారు. అనంతరం దొమ్మేరు గ్రామంలో స్వామి ఇంటి వద్ద టెంటువేసుకుని జనసేన నాయకులతో బైఠాయించి న్యా యం చేయాలంటూ నిరసన వ్యక్తంచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa