ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్ద మనస్సు చాటుకున్న ఎమ్మెల్యే బునేసి విరూపాక్షి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 10, 2025, 06:20 PM

ఆప‌ద‌లో ఉన్న వారికి సాయం చేయ‌డంలో ఆలూరు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బునేసి విరూపాక్షి ముందుంటారు. మ‌రోసారి ఆయ‌న మాన‌వ‌త్వం చాటుకున్నారు.  ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో  ఆగస్టు 20వ తేదీన  ప్రమాదవశాత్తు 5వ తరగతి చదువుతున ఆరుగురు విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఆ ఆరుగురు పిల్ల‌ల కుటుంబాల‌కు విరూపాక్షి అండ‌గా నిలిచారు. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక‌సాయం అందించి ఆదుకున్నారు. ఈ సంద‌ర్భంగా బుసినే విరుపాక్షి మాట్లాడుతూ... ఐదో త‌ర‌గతి చ‌దువుతున్న పిల్ల‌లు అకాల మ‌ర‌ణం చెంద‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఆ కుటుంబాల‌కు అండగా నిల‌వాలన్నారు.  పిల్ల‌ల మ‌ర‌ణాల‌పై తానే స్వ‌యంగా  జిల్లా క‌లెక్ట‌ర్‌తో మాట్లాడాన‌ని, ఇంత వ‌ర‌కు ఎలాంటి సాయం అంద‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు.  ఆ కుటుంబాల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో  వైయ‌స్ఆర్‌సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్,  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa