ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్‌లో పరిస్థితులపై స్పందించిన చైనా

international |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 01:50 PM

పొరుగు దేశమైన నేపాల్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చైనా తొలిసారిగా అధికారికంగా స్పందించింది. దేశంలోని పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి, అంతర్గత సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు పలికింది. దేశంలో శాంతిభద్రతలు, స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని ఆకాంక్షించింది.చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ బీజింగ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నేపాల్‌తో తమకు బలమైన, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. "నేపాల్‌లోని అన్ని రాజకీయ పక్షాలు కలిసికట్టుగా నిలిచి, దేశీయ సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా అక్కడ సామాజిక స్థిరత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాం" అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, నేపాల్‌లోని చైనా పౌరుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారి రక్షణ కోసం తమ రాయబార కార్యాలయం ఇప్పటికే అత్యవసర భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa