ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతాంగం సమస్యలపై చర్చకి సిద్ధమన్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 01:25 PM

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో రైతుల సమస్యలపై చర్చకు వైయ‌స్ఆర్‌సీపీ పట్టుబడుతోంది. రైతుల సమస్య, యూరియా అంశాలపై చర్చించాలంటూ  వైయ‌స్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ  సభ్యులు ఆందోళనకు దిగారు.  యూరియా కొరత సమస్య తీర్చాలని, పంటకు గిట్టుబాటు ధర సమస్య పరిష్కరించాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులతో అధికార సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ ఆందోళనల నడుమ మండలిని కాసేపు చైర్మన్‌ వాయిదా వేశారు. అయితే.. రైతాంగం సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని, ఆ చర్చ రేపు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa