పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల స్వప్నమైన, వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వరికపూడిసెల ప్రాజెక్టుకు నవంబర్ 15, 2023న నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని పల్నాడు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాలుగా మరుగున పడిన పల్నాటి ప్రజల చిరకాల కల వరికేపూడి శెలను తిరిగి పట్టాలెక్కించింది వైయస్ఆర్సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏమీ చేయని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అంతా తామే చేశామని సో షల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని పిన్నెళ్లి తీవ్రంగా ఖండించారు. వరికపూడిసెల ప్రాజెక్టు ఆవశ్యతకను నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అతి కష్ట సాధ్యమైన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ అనుమతులు తెచ్చారని మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అన్నీ వండి పళ్ళెంలో పెడితే వరికేపూడి శెల విషయంలో తామేదో చేసినట్లు బ్రహ్మారెడ్డి సోషల్ మీడియా ద్వారా జబ్బలు చరుకుకుంటున్నడని ఎద్దేవా చేశారు. మేము ప్రాజెక్టు అన్నీ సమకూర్చామని, టీడీపీ నేతలకు చేతనైతే చంద్రబాబు కు చెప్పి బడ్జెట్ లో నిధులు కేటాయించేలా ఒత్తిడి తేవాలని సూచించారు. ఇప్పటి వరకు వరికేపూడిశెల విషయంలో బ్రహ్మారెడ్డి చేసింది జీరో అని..ఇక ముందు చేయబోయేది జీరోనే అన్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ బ్రహ్మారెడ్డి అందిన కాడికి ఆస్తులు కూడబెట్టుకుంటూ పదవి పోయక నమ్ముకున్న కార్యకర్తల్ని నట్టేట ముంచి నియోజకవర్గాన్ని వదిలి వెళ్లడం ఖాయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa