ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య శ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిన అదేపేరుతో అసెంబ్లీ సిబ్బంది వ్యవహారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 01:32 PM

కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర అయింది. ఆ ప్రభుత్వం పెట్టిన పేర్లను పట్టించుకోకుండా.. గత జగన్ ప్రభుత్వ పథకాల పేర్లతోనే నేటికి అసెంబ్లీ సిబ్బంది వ్యవహరిస్తుండడం పట్ల సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి వేళ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ శుక్రవారం అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై స్పందించారు. ఆరోగ్య శ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందంటూ ఆయన వివరణ ఇచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ జోక్యం చేసుకుంటూ.. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజాధనం దారాదత్తం చేశారంటూ ఆరోపించారు. వెంటనే మంత్రి సత్య కుమార్ స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రూ. 457 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లింపులు చేసిందని వివరించారు.అయితే ఆరోగ్యశ్రీ నిలిచి పోయిందనటంలో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మారిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇక ఎన్టీఆర్ వైద్యసేవల ద్వారా ఇప్పటికి 13, 42, 000 వేల మంది లబ్ది పొందారని గణాంకాలతో సహా ఆయన వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలకు బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీ అని ఎమ్మెల్యే ప్రశ్న అడిగారని.. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే బ్రాండింగ్ జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa