అసెంబ్లీలో సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పనులుపై కూడా చర్చించాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.ఈ సందర్భంగా సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ‘ఎమ్మెల్యేలంతా సభలో జరిగే చర్చల్లో కచ్చితంగా పాల్గొనాలి. సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడితేనే ప్రజలు మళ్లీ చాన్స్ ఇస్తారు. కాబట్టి ఎమ్మెల్యేలు అన్ని అంశాలపై అవగాహన కల్పించుకుని సభలో జరిగే చర్చల్లో పాల్గొనాలి. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదు. శాంతిభద్రతల సమస్యా ఉంది. దీనిపై సభలో చర్చించండి. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ చేస్తున్న వ్యాఖ్యలు అందరికీ ఇబ్బందికరంగానే తయారయ్యాయి. ఈ అంశంపై సీరియ్సగా స్పందించాలి’ అని పవన్ సూచించారు.మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పలు సూచనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa