మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని వైసీపీ విష ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత విద్యా వ్యవస్థను, మెడికల్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి ఇప్పుడు చలో పాడేరు మెడికల్ కాలేజీ అంటూ జగన్నాటకానికి తెర లేపారంటూ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల నిర్మాణ నిమిత్తం గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జగన్ రెడ్డి దుర్వినియోగపరిచారని ఆరోపించారు. పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉన్నత విద్యను దూరం చేసింది జగన్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ దొంగ నాటకాలు కట్టిపెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చలో పాల్గొనాలన్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును వైసీపీ అపహాస్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సగానికి పైగా సీట్లను ప్రైవేటు పరం చేసింది వైసీపీనే అని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్నారై కోటా సీట్లను ప్రవేశపెట్టిందే వైసీపీ అని గుర్తుచేశారు. జగన్ సీఎం కాకముందు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్నారై కోటా సీట్లు లేనేలేవని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa